Thursday 14 August, 2014

MUKTINATH TEMPLE

వైష్ణవులు అంత్యంతపుణ్యక్షేత్ర ప్రదేశంగా కొలిచే శ్రీముక్తినాథ్పవిత్ర ఆలయం ఎక్కడవుందో..?
ఇదిగో .. ఇక్కడ .. చదవండి .. చూడండి ..!! స్వామిని దర్శించుకొందాం..!! ముక్తిని పొందుదాం !!
శ్రీముక్తినాధ్పవిత్ర పుణ్యక్షేత్రం నేపాల్ లో, 3750 మీటర్ల (12,300 feet) ఎత్తున, “Thorong La” పర్వతప్రాంతవద్ద (దీనినేధవళగిరి -అంటారు),ముస్తాంగ్ జిల్లా, “ముక్తినాథ్లోయలో ఉన్న ఒకహిందూ, బౌద్ధమతపవిత్ర ప్రదేశం. ఇదిఖాట్మాండునుండి 140 కి.మీ. దూరంలోగండకినది దగ్గర వుంది.
ముక్తినాథ్అనే పేరుముక్తిమరియునాథ్అనే రెండు సంస్కృత పదాల కలయిక. “ముక్తిఅంటేమోక్షంఅనినాథ్ఆంటేదేవుడులేదాప్రదాతఅని అర్థం.మోక్ష ప్రదాతఆలయం, భక్తులను వేలజననమరణ” (పునర్జన్మ) చక్రం నుండి ముక్తి (మోక్షం) సాధించటానికి సహాయపడే ప్రదేశంగా, “ముక్తినాథ్క్షేత్రంగా పిలవబడుతోంది.
ముక్తినాథ్హిందువులకే కాకబౌద్ధ మతంవారికి కూడా ఒక పవిత్ర,తీర్థయాత్ర స్థలం. ముక్తినాథ్ పుణ్యక్షేత్ర ముఖద్వారం పైశ్రీ మహా విష్ణువు యొక్క చిత్రంకలిగివిష్ణు ఆలయంగా మరియు బౌద్ధుల ఆరాధన చేసేపగోడతరహా నిర్మాణం కలిగిగొంపగా, రెండు మతముల వారికి అతి పవిత్రమైన స్థలంగా విలాజిల్లుతోంది.
బౌద్ధమతస్తులు దీనిని Chumig Gyatsa (108 waterspouts) (108 పవిత్ర తీర్థస్థానం) గా పిలుస్తారు.
ఆలయ ప్రాంగణం లోనికొనేరుని "గండకి నది" లేదాచక్ర తీర్థంఅంటారు. ఆలయ లోపల పుణ్యక్షేత్ర "కనక విమానం" అంటారు.
ఆలయం ఏడాది పొడవునా తెరిచేవుంటుంది. ముఖ్యంగాఋషితర్పణం” “రామ నవమిమరియువిజయ దశమిరోజుల్లో వేలాది మంది భక్తులుఇక్కడకు వచ్చి పండుగలను జరుపుకుంటారు.
ఆలయం చేరుకోవటానికి - నేపాలు లోనిఖాట్మాండుకు రావాలి. “ఖాట్మాండునుండిజసోమ్వరకువిమానసర్విస్ వుంటుంది.జసోమ్ నుండిముక్తినాథ్వరకుహెలికాప్టర్సర్వీసు ఉంటుంది. జీపు,గుర్రాల మీద కూడ ముక్తినాథ్ చేరుకోవచ్చు.
ముక్తినాథ్ ఆలయాన్నిశక్తి పీఠంగా కూడా పరిగణిస్తారు. ఇక్కడ శక్తినిగండకి చండీగా పిలుస్తారు. సతీ దేవినుదురుఇక్కడ పడిందని నమ్ముతారు
ముక్తినాథ్క్షేత్రం అత్యంత పురాతన స్థలం. “వైష్ణవులు ముక్తినాథ్ కేత్రాన్ని,“స్వయంవ్యక్త” “అష్ట(8)విష్ణు క్షేత్రాలలో ఒకటిగా పరిగణిస్తారు.(మిగిలిన ఏడు-శ్రీరంగం,Srimushnam, తిరుపతి, నైమిశారణ్యం,తోతాద్రి,పుష్కర్, బద్రినాథ్ లు)
ఆలయం చాలా చిన్నది. గర్భాలయం లోవున్నశ్రీ మూర్తులుబంగారంతో చేయబడి,అత్యంత సుందరంగా వుంటాయి.భక్తులు ఈఆలయ ప్రాంగణం లోని “108 గోముఖాలద్వారా ప్రవహించే పవిత్రమైనపుష్కరిణిలో (చివరకు గడ్డకట్టే ఉష్ణోగ్రతలో కూడా)స్నానం చేసి స్వామిని దర్శించుకుంటారు. ఆలయ దర్శనానికి మార్చ్ఏప్రిల్ మాసాలు చాలా అనుకూమైన కాలం.జూన్-జూలైలు ఇక్కడ వర్షాకాలం.
శ్రీ వైష్ణవులు క్షేత్రాన్ని “108 దివ్య దేశంలలో “105 దేశం(క్షేత్రం)”గా పరిగణిస్తారు 108 “ధారలనే “108 దివ్య శ్రీ వైష్ణవ క్షేత్రపుష్కరిణిధారలుగా భావిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయ,సాహిత్యం ప్రకారం దీని పూర్వ నామంతిరు శాలిగ్రామం”. ఇక్కడే వున్న శ్రీశాలిగ్రామశిలలనేశ్రీమన్నారాయణగా భావించి అంత్యంత భక్తి శ్రధ్ధలతో పూజ చేస్తుంటారు.
ఇది పేరుకు మాత్రంవైష్ణవాలయంఅయినప్పటికి, “టిబెట్ బౌధ్దులుకూడా దీనిని వారి పవిత్రమైన ఒకగొంపగా పరిగణించి, హిందువులతో పాటు సమానంగా పూజలు (ఆరాధన) నిర్వహిస్తారు. వారు ఆలయాన్ని(108 waterspouts) 108 పవిత్ర తీర్థస్థానం స్థలంగా భావిస్తారు. ఆలయంలో ఒకబౌద్ధ సన్యాసి మఠంకూడా వుంది.
ఇంతే కాకుండా, “తాంత్రిక విద్యోపాసకులకి కూడా ప్రదేశం, వారికు వున్న “24 తాంతిక విద్య ప్రదేశాలలో ఒకటిగా నమ్ముతారు. ఆలయంలో వున్నవిగ్రహ మూర్తినిఅవలోకితేశ్వరఅవతారంగా నమ్ముతారు.
ఇన్ని విశేషాలున్నఈముక్తినాథ్ఆలయ దర్శనం మనందరికీ నిజంగాముక్తినిప్రసాదిస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు ..! మనలో ఎవరికైనా వెళ్ళే వీలైతే .. ముక్తినాధుని దర్శన తోజన్మధన్యంచేసుకుందాం.!!.




1 comment: