Thursday 14 August, 2014

మహాశివుని మెప్పించి రావణాసురుడు సంపాదించిన “శివుని ఆత్మలింగం” ( GOKARNA )

రావణాసురుడు శ్రీ మహాశివుని మెప్పించి, హిమాలయాల లోనికైలాస పర్వతంనుండి సంపాదించినశివుని ఆత్మలింగం”.. ఇప్పటి .. శ్రీగోకర్ణ”(గోకర్ణం) మహా పుణ్య క్షేత్రంలో వుంది.!!
గోఅంటేఆవు” – “కర్ణఅంటేచెవిఅని అర్ధం.! “శివుని” “ఆత్మలింగం” - “ఆవు చెవిఆకారంలో వుండటంవల్ల, అది వున్న ప్రదేశం కూడాగోకర్ణగా పిలవబడుతోంది
గోకర్ణ గ్రామంకర్ణాటక రాష్ట్రం, ఉత్తర కన్నడ జిల్లాలో, అరేబియా సముద్ర తీరంలో ఉన్నది. బెంగళూరు కి (545 కి.మి.)దూరంలో, ఉత్తర కన్నడ జిల్లాకార్వార్కి 55 కి.మి దూరంలో ఉన్నది. గోకర్ణశైవ క్షేత్రంగా చాలా ప్రసిద్ధి చెందినది. దీనినేదక్షిణ కాశీగా కూడా పిలుస్తారు. క్షేత్రమేఏడు ముక్తిక్షేత్రంలలో ఒకటిగా, “ముక్తిస్థలంగా హిందువులు ఇక్కడ పితృ తర్పణాలు కూడా సమర్పిస్తారు.(కర్నాటక రాష్ట్రం లోని మిగిలిన ముక్తిస్థలా లుఉడిపి , కొల్లూర్, కొక్కే సుబ్రహ్మణ్య ,కుంబసీ ,కోడేశ్వర మరియు శంకరనారాయణలు). గ్రామములో అత్యంత సుందరమైన బీచ్ లు కూడా వున్నాయి. గ్రామంగోవాదగ్గరగా ఉండడం, బీచ్లు సుందరంగా ఉండడంతో అంతర్జాతీయ పర్యాటకులను సైతం విశేషంగా ఆకర్షిస్తోంది. !!
ఇతిహాసం ప్రకారం, “రావణాసురుడుశివుని గురించి అకుంఠిత తపస్సు చేసి,శివుని మెప్పించి, “ఆత్మలింగాన్నిభూలోకానికి తెస్తాడు. కాని శివుడిచ్చిన ఆత్మలింగంస్వభావంప్రకారంభూమిమీదఆలింగం ఎక్కడ పెడితే అక్కడస్థాపితంఅయి, అక్కడ నుండి తిరిగిఎత్త శక్యం కాదనిమహా శివుడు చెబుతాడు.ఇక దేవతలు, రావణాసురుడు శివుని ఆత్మలింగాన్ని లంకలో ప్రతిష్ఠిస్తే ప్రతికూల చర్యలు జరుగుతాయని భావించి, విష్ణువును వేడుకొనగా, విష్ణువు తనమాయతో సూర్యాస్తమయం అయ్యేటట్లు చేస్తాడు. అప్పుడు రావణుడు సూర్యాస్తమయం అయిందని భావించి, సంధ్య వార్చుకోవడానికి సంసిద్ధుడు అవుతాడు.
విషయం తెలుపుకొన్న నారదుడువినాయకునివద్దకు వెళ్ళి, రావణాసురుడి వద్ద నుండి ఆత్మలింగం గ్రహించి,దానినిభూమి మీద పెట్టాలనికోరతాడు.అప్పుడు వినాయకుడు నారదుడు కోరినట్లు,రావణాసురుడు సంధ్యవార్చుకొనే సమయానికిబ్రాహ్మణ వేషంలోవెడతాడు. బ్రాహ్మణ బాలకుడిని చూసిన వెంటనే,రావణాసురుడు తాను సంధ్యవార్చుకొనవలసిన సమయమై నందున, లింగాన్నిపట్టుకొనవలసిందిగా కోరుతాడు. అది విన్న వినాయకుడు,లింగంచాలా బరువుఉంటే తాను ఎక్కువ సేపు మోయలేనని, మోయలేక పోయినప్పుడుమూడుసార్లు పిలుస్తానని, పిలుపుల లోగా రావణాసురుడు రాకపోతే, లింగాన్ని భూమి పైన పెడతానని చెబుతాడు.
రావణాసురుడు అందుకు అంగీకరించగా, వినాయకుడు లింగాన్ని తన చేతులలోకి తీసుకొంటాడు. రావణాసురుడు సంధ్యవార్చు కోవడానికి అటు వెళ్ళగానే, గణపతి లింగాన్ని మోయలేక పోతున్నట్లు, వెంట వెంటనేమూడు సార్లుపిలుస్తాడు. సంధ్యవార్చు సమయంమధ్యలోఉండడంతో రావణాసురుడు అక్కడకు వచ్చేటప్పటికే, వినాయకుడు లింగాన్ని భూమి మీద పెట్టేస్తాడు . రావణాసురుడు వచ్చి లింగాన్ని భూమి మీద నిలిపినందుకు గణపతినెత్తిమీదమొట్టుతాడు, గణపటి నెత్తికిగుంటపడుతుంది. అట్లా వినాయకుడు ఆత్మలింగాన్ని భూమిమీద పెట్టిన స్థలంమే గోకర్ణపుణ్యక్షేత్రం.
ఇక విష్ణువు తన మాయని తొలగించగా, వెంటనే సూర్యుడు ఆకాశంలో మళ్ళి కనిపిస్తాడు. విషయాన్ని గ్రహించిన, రావణుడు ఎంతో కోపోద్రిక్తుడై ,ఆత్మలింగాన్ని తనచేతులతోపెకలించ ప్రయత్నం చేస్తాడు. ప్రయత్నం లోనే ఆత్మలింగంలింగ రూపంకోల్పోయి, చేతులతో గట్టిగాపైకి లాగటం (పీకటం) వల్ల,” పొడవుగా సాగి”– “అవు చెవిరూపం సంతరించుంకుంది. ఆత్మలింగమేఐదు భాగాలుగా విడిపోయిఐదు ప్రదేశాలలోపడినట్లు స్థల పురాణం చెపుతోంది.
ఆత్మలింగంమొదటిబాగమేగోకర్ణంలోమహాబలేశ్వరలింగంగా పిలవబడుతూఆవు చెవిరూపంలో వున్నది. ఆత్మలింగంరెండోభాగం, లింగం పైనున్నకవచంవిచ్ఛిన్నం అయి, గోకర్ణకు సుమారు 70 కి.మీ. దూరంలో వున్నసజ్జేశ్వరఅనే ప్రదేశంలో పడుతుంది.దీనినేసిద్ధేశ్వరలింగ అని కూడా పిలుస్తారు. ఆత్మలింగంమూడోభాగం, గోకర్ణకు దక్షిణాన సుమారు 45 కి.మీ.దూరంలో వున్నధారేశ్వర్లో పడినట్లు తెలుస్తోంది.ఇకలింగంపైనున్ననాలుగవభాగంగా, లింగం పైన వున్నమూతనుతొలగించివిసిరి వేస్తే అది గోకర్ణకు 60 కి.మి దూరంలో ఉన్నగుణేశ్వరలో పడుతుంది.దీనినేగుణవంతేశ్వరలింగ అని కూడా పిలుస్తున్నారు. లింగం పైనున్నఐదవభాగం,“వస్త్రాన్నివిసిరివేస్తే అదికందుక పర్వతంపై నున్నమృదేశ్వరలో పడుతుంది. ఆపేరు కాలక్రమంలోమురుడేశ్వరగా మారింది. మురుడేశ్వర క్షేత్రం గోకర్ణ కు సుమారు 70 కి.మీ.దూరం లో వుంది. ఇక్కడే సముద్రపు ఒడ్డున అత్యంత సుందరమైన పెద్ద శివ విగ్రహం (123 ft. ఎత్తు ) వున్నది.
గోకర్ణ లోని శివభక్తులు మహాబలేశ్వరుని ఆత్మలింగాన్నిశాలిగ్రామ పీఠంలోనిమధ్యభాగంలో వున్నగుండ్రని రంధ్రంలోనుండి తమ చేతులతో తాకుతారు. మహాబలేశ్వరుని ఆలయానికి ప్రక్కగాగణపతిఆలయం కూడా ఉంది. రావణాసురుడుతలపైమొట్టాడు అనడానికిగుర్తుగాగణపతిమాడుమీదగుంటగా ఉంటుది. గణపతిని అందరు సృశించవచ్చు, గణపతికి అభిషేకం కూడా స్వయంగా చేయవచ్చు.
శ్రీ మహాబలేశ్వరుడి దేవాలయానికి దగ్గరలొనేభద్రకాళిదేవాలయం ఉన్నది. భద్రకాళినిఅన్నపూర్ణమ్మతల్లితో సమానంగా భావిస్తారు. ఆవిడ చేతిలోతక్కెడ”(త్రాసు) సరిసమానంగా ఉండకుండాహెచ్చుతగ్గులుగా వుంటుంది. గోకర్ణ పుణ్యక్షేత్రంలో ఒకతటాకం( కోనేరు) ఉంది దీనినేకోటీ తీర్థగా , “గంగతో సరి సమానంగా ప్రాంతీయులు భావిస్తారు. గతించిన తమ పెద్దలకు ఇక్కడపితృ తర్పణాలుకూడా సమర్పిస్తారు.
గోకర్ణ గ్రామానికి 10 కి.మి. దూరంలో మంగళూరు-ముంబాయి కొంకణ్ రైల్వే లైనులోగోకర్ణ రోడ్ రైల్వే స్టేషన్ఉన్నది. కాని గోకర్ణ రైల్వే స్టేషన్ లోప్యాసింజర్ రైళ్లుమాత్రమే నిలుస్తాయి.“ఎక్స్ప్రెస్‌”రైళ్లు గోకర్ణకు 23 కి.మి. దూరంలో ఉన్నకుంటా”, 25 కి.మి. దూరంలో ఉన్నఅంకోలా”, మరియు ఉత్తర కన్నడలోకార్వార్లోఆగుతాయి.ఇక్కడకు బస్సు సౌకర్యంకూడా వుంది. హొబ్లీ నుండి,హంపినుండి గోకర్ణకు తరచూ బస్సులు ఉన్నాయి. గోవా నుండి ప్రొద్దున్న 8 గంటలకు సరాసరి గోకర్ణకు చేర్చే బస్సు ఉన్నది (5 గంటల ప్రయాణం). మంగళూరు (252 కి.మి.) నుండి ఉదయం 7 గంటలకు బస్సు ఉన్నది. బెంగళూరు నుండి పగలు 9 గంటలకు, మైసూర్ నుండి పగలు 6 గంటలకు గోకర్ణకు సరాసరి బస్సులు నడుస్తాయి.

ఇదండీ .. శ్రీ గోకర్ణ మహా పుణ్య క్షేత్ర కధ ..! మీరు కూడా ఆయన దర్శనాన్ని కోరుకుంటున్నారు కదా.. !! శుభం భుయాత్ ..!!




No comments:

Post a Comment