శ్రీ
“గుహ్యెశ్వరీ/గుఃజేశ్వరి/గురేశ్వరి/మాహామాయ” దేవి మొదలైన పేర్లుగల
ఈ శక్తిపీఠం నేపాల్ దేశంలో, కాట్మాండ్ పట్టణంలోని “బాగమతి” నది వడ్డున, “పశుపతినాథ్
దేవాలయం” దగ్గర వున్నది !!
“గుహ్యెశ్వరి”
అనగా-(గుహ్య – రహస్య/రహస్యాంగ) – “ఈశ్వరి”
అనగా ”దేవత”–“రహస్యాంగ దేవత” అని పూర్తి
అర్దం..!
సతీదేవి
“రహస్యాంగమ్”(Private
Part) -“రెండు” ప్రదేశాలలో పడిందని, “మొదటి” భాగం(Outer Parts), అస్సాం రాష్ట్రంలోని, “గువా”హాతి (గౌహతి)
లోని “కామాఖ్యదేవి ఆలయం” వద్ద, “రెండో”
భాగం(Inner Parts) ఈ ప్రదేశంలో పడిందని
ఇతిహాస కధనం..!
ఈ ఆలయం పూర్తిగా “తాంత్రిక
విద్యోపాసన”కు సంబందించినది. “తాంత్రికులకు”
అతి ముఖ్యమైన “ఉపాసన” స్థలంగా చెపుతారు!!
ఈఆలయం
విశేషం ఏమిటంటే, ఆలయ ప్రాంగణం లోనికి
“హిందూ ఏతరులకు” (అన్య మతస్తులకు) ప్రవేశం
లేదు.!
పూర్వం
ఈ ఆలయం ఒక చిన్న
“ఖాళీ ప్రదేశంలో” వుండేది. అక్కడే నివాసముండే కొంతమంది గ్రామస్తులు మొదటసారిగా ఈ దేవిని ఆరాధించటం
ప్రారంభించారు. ఆ పరిణామ క్రమంలో
భాగంగా, “రాజా ప్రతాప్ మల్ల”
17 వ శతాబ్దం ప్రారంభంలో(1653) ప్రస్తుతం ఉన్న ఈ ఆలయాన్ని
నిర్మించారు.
ఈ ఆలయం “భూటాన్ దేశ
సంస్కృతికి అనుగుణంగా వారి “పగోడ” ఆకారంలో
నిర్మించబడి, చూపరులకు ఆకర్షించేదిగా “వుండకపోవటం” ఆశ్చర్యంగా వుంటుంది.!
ఐతే,
ఈ ఆలయ “ప్రధాన మందిరం”
పుష్పమాలలతో అందంగా అలంకరించి వుండి, చూడటానికి చాలా మనోహరంగా వుంటుంది..!
మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే , ఇక్కడ
ఆలయంలో వివాహం జరుపుకున్న జంటలు, మరో “ 6 జన్మలు పాటు” అదే “సహచర-జంట”(same couple) లుగా “పునర్జన్మలు” ఎత్తుతారని
ఇక్కడి ప్రజల ప్రఘాడ నమ్మకం
!
ఈ ఆలయంలో జరిగే “నవరాత్రి పండుగ”ల సందర్భంగా
నేపాల్ రాజు , అతని కుటుంబ సభ్యులు
కలిసి “భాగమతి” నదిలో పవిత్ర స్నానం
చేసి పూజించే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది !!
పెళ్ళైన
వారు, తమ భర్తల ఆరోగ్యం
కోసం ఇక్కడి దేవిని పూజిస్తూవుంటారు !! అలాగే “శత్రు-విజయం” కోసం
కూడా ప్రార్ధనలను చేస్తువుంటారు.!!
No comments:
Post a Comment