ఈ శక్తిపీఠం, నేపాల్ దేశంలోని “జనక్ పూర్” లో
వుంది. !!
“జనక్
పూర్” పట్టణం, నేపాల్ లోని కాట్మాండు నుండి
135 km దూరంలోని “ధనుష” జిల్లాలో వుంది.
ఈ ప్రాంతం దిగువ నేపాల్ గా
కూడా పిలుస్తారు. ఈ జనక్ పూర్
“జనక్ పూర్ ధామ్” గా
(scared region) కూడా పిలివబడుతోంది. ఇది “ఇండియా సరిహద్దు”
నుండి కేవలం 20 కి.మీ. దూరంలో
వుంది.!!
ఇక్కడ
సతీ దేవి “వామ స్కందం”
(వెడమ భుజం) (left shoulder) పడినదని నమ్ముతారు..!!
ఈ “జనక్ పూర్”(ఉమాదేవి
) శక్తిపీఠం గురించి “రెండు” కధనాలు వినిపిస్తాయి.
“ఒక కధనం” ప్రకారం ఈ
“జనక్ పూర్”(మిథిలాంచల్) “రామాయణం”
లోని శ్రీ “సీతా దేవి”
పుట్టినిల్లు. ఇది జనక్ పూర్
రైల్వే స్టేషన్ నుండి కేవలం 1 Km దూరంలో
వుంది. చాలా మంది ఇక్కడ
వున్న సుప్రసిద్ధ “జానకి మందిర్” నే
ఒక “శక్తిపీఠం”గా నమ్ముతారు. ఇక్కడ
వున్న శ్రీ “సోనామాయి మందిర్”
పురాతన శక్తి ఆలయముగా భాసిస్తోంది.
శ్రీ జనక మహారాజు ఈ
ప్రాంతంలోని భూమినే దున్నుతుండగా “సీతాదేవిని” పొందినట్లు చెపుతారు.
ఇక “రెండో కధనం” ప్రకారం,
బీహార్ లో, మధుబనిజిల్లా డివిజన్,
Benipatti Subdivion చెందిన
“Ucchaith” గ్రామంలో వున్న “Uchaitha Durgasthan” (దేవి భగవతి)నే
“శక్తి పీఠం”గా భావిస్తారు.
ఈ Ucchaith గ్రామంకూడా, నేపాల్ “జనక్ పూర్” నుండి
కేవలం 30 Km దూరంలో ( సమీప రైలుస్టేషన్ కామ్తాల్
-24 K.m) ఉంది. దీనికి “దర్భాంగా” నుండి కూడా బస్సులు
వున్నాయి.
ఇది
“Uchaith” లేదా
“Uchaitha”స్థాన్ గా పిలవబడే “దుర్గ
మాత” దేవాలయానికి ప్రసిద్ధి. ఈ గ్రామ స్థానిక
భాష “మైథిలీ” లో వుంటుంది. ఇది
“మిథిలాంచల్” యొక్క ప్రముఖ చారిత్రక
స్థలాల్లో ఒకటిగా ఉంది.
నేపాల్లో
“మిథిల సంస్కృతి ”కు వేల ఏళ్లనాటి
చరిత్ర ఉంది. దానికి “స్వంత
భాష”(మైథిలి) మరియు “లిపి” కూడా ఉంది.
ఎన్నో కావ్యాలు, కధలు ఈ మైథిలి
భాష”లో కూడా వ్రాయబడ్డాయి.
ఈ ప్రశాంత ప్రాంతంలోని అధ్భుతమైన “మిథిలా సంస్కృతి” గురించి తెలుసుకోవడానికి భారతదేశం నుండి, నేపాల్ చుట్టూ వుండే హిందూ భక్తులే
కాక, అనేక మంది విదేశీయులు
సైతం “జనక్ పూర్” జీవనాన్ని
గురించి తెలుసుకోవడానికి సందర్శింస్తూవుంటారు.
మొదటి
సహస్రాబ్ది(BC) కు చెందిన “శతపథ
బ్రాహ్మణ” చరిత్ర ఆధారంగా “మాధవ విదేహ” రాజు,
తన గురువు “గౌతమ రాహుగణ” నేతృత్వంలో
మొదటసారిగా “Sadānirā
(Gandaka)”నదిని దాటి,“మిధిలా నగరం”
రాజధాని గా“విదేహ” రాజ్యం
స్థాపించాడు.ఈ సంఘటనలు అన్నీ,
“గౌతమ రాహుగణ” అనేక శ్లోకాలతో “ఋగ్వేదం”
లో కూర్చబడి, ఋగ్వేద కాలానికి చెందివినవిగా గుర్తించబడినాయి.
దీనికి
అదనంగా, ఇద్దరు గొప్ప మునులు, హిందూమత
స్థాపకుడు “గౌతమ బుద్ధుడు”, మరియు
జైనమత “24వ, చివరి తీర్ధంకర”ఐన “వర్ధమాన మహావీర”
లు ఈ మిథిలా/జనక
పూర్ లోనే “నివసించార”ని
తెలపబడింది. ఈ ప్రాంతం అంతా
మొదటి మిలీనియంలో భారతదేశ చరిత్ర కు ముఖ్య కేంద్రంగా
ఉంది.
ఈ జనక్ పూర్ కు
వున్న “పూర్వ చరిత్ర” ను
పరిశీలిస్తే , 1657 లో బంగారం తో
చేసిన ఒక “సీతా దేవి
“ విగ్రహం ఇక్కడే, ఈ మందిరం వున్న
ప్రదేశంలోనే దొరికినదని, దాని నాధారంగా “సీతాదేవి”
ఇక్కడే నివసించిందని చెపుతారు.
పురాణ
కధల ప్రకారం, “శూర్ కిషోర్ దాస్”
అనే సన్యాసి “సీతారాముల” దేవత చిత్రాలను ఈ
ప్రదేశంలోనే కనుగొన్నాడని చెపుతారు. నిజానికి ఈ “శూర్ కిషోర్
దాస్” “ఆధునిక” జనక్ పూర్ నిర్మాత
మరియు వ్యవస్థాపకుడు కూడా. ఈ పవిత్ర
ప్రదేశంలో “సీత ఉపాసన తత్వశాస్త్రం”(సీతా ఉపనిషత్తు) గురించి
బోధించిన గొప్ప రచయిత మరియు
ముని శ్రేష్టుడు. ఇక్కడి ఈ ప్రదేశంలోనే జనక
మహారాజు “శివ ధనుస్సు”కు
“పూజలు” చేశారని కూడా ఈయన పేర్కొన్నారు
!!
ఇక “ఆధునిక చరిత్ర” ఆధారంగా, ఈ “జానకి మందిరం”ను మధ్య భారతదేశంకు
చెందిన “తికమ్ ఘర్” రాణి
శ్రీ “Brisabhanu
Kunwari” చే 1911లో 900,000 రూపాయల ఖర్చుతో నిర్మించబండినట్లు తెలుస్తోంది.దీనినే “Nau Lakha Mandir”గా కూడా పిలుస్తారు.
ఈ జనక్ పూర్ ను
సందర్శించడానికి సెప్టెంబర్ నుండి మార్చి వరకు
మంచి కాలం. ఈ కాలంలో
వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉండి,అనేక పండుగలు కూడా
ఈ కాలంలోనే జరుగుతాయి.
ఇదండీ
.. జనక్ పూర్ శక్తి పీఠం
పూర్తి విశేషాలు . !! మీలో ఎవరైనా వెళ్లగలిగితే
.. ఈ రెండు ప్రదేశాలు చూసి
వస్తే “పూర్తి శక్తిపీఠం” చూసినవారు అవుతారు ! శుభం భూయాత్. !!
No comments:
Post a Comment