Sunday 24 August, 2014

పశుపతినాథ్ ( NEPAL )

పశుపతినాథ్ దేవాలయం నేపాల్ దేశ రాజధాని ఖాట్మండు నగర ఈశాన్య దిక్కు పొలిమేర్లలో, బాగమతి నది ఒడ్డున ఉన్నది. పశుపతి (శివుడు) ప్రధాన దైవంగా ఉన్న దేవాలయం ప్రపంచంలోనే అతి పవిత్రమైన శైవ దేవాలయంగా హిందువులతో పాటు ప్రపంచంలోని సమస్త శైవ భక్తులందరూ భావిస్తారు.భారతదేశం,నేపాల్ నుండి భక్తులు దేవాలయాన్ని సందర్శిస్తారు. మహాశివరాత్రి రోజు అత్యంత పర్వదినం, వేల సంఖ్యలో భక్తులు పశుపతిని దర్శిస్తారు.
ఇక్కడ ముఖ్యమైన విశేషం ఏమంటే, దేవాలయంలోనికి హిందువులు కాని వారిని అనుమతించరు. అన్యమతస్థులు బాగమతి నది ఒడ్డునుండి మాత్రమే దేవాలయం దర్శించే అవకాశం ఉన్నది.

దేవాలయంలో ఉన్న మూల విరాట్టుని నలుగురు అర్చకులు మాత్రమే స్పృశించే అధికారం ఉన్నది.
శంకరాచార్యులు వారు ప్రారంభించిన ఆలయ సాంప్రదాయం ప్రకారం ఇక్కడి అర్చకులు దక్షిణ భారతదేశం నుండి నియమించబడతారు.

దక్షిణ భారతదేశం నుండి అర్చకులు ఇక్కడ పూజలు నిర్వహించడానికి ప్రధాన కారణం నేపాల్ రాజు మరణించినప్పుడు నేపాల్ దేశము సంతాప సముద్రములో ఉంటుంది. నేపాల్ ప్రజలకు పశుపతినాథ్ స్వామి నిత్యకైంకర్యాలు చేసే అవకాశం ఉండదు, పశుపతినాథ్ కి నిత్యకైంకర్యాలు నిరంతంగా కొనసాగాలనే కారణం చేత భారతదేశార్చకులు ఇక్కడ అర్చకత్వం నిర్వహిస్తుంటారు.

శంకరాచార్యులు ఇక్కడ మానవ మరియు జంతు బలిని నిషేధించారు. దేవాలయం తూర్పున వాసుకినాథ్ దేవాలయం ఉన్నది.

ఒక ఇతిహాసం ప్రకారం శివుడు ఒకప్పుడు జింక వేషం ధరించి బాగమతి నది ఒడ్డున విహరిస్తుండగా దేవతలు, శివుడు తన స్వరూపంలో చూడలని కోరికతో దేవతలు శివుడు జింక అవతారంలో ఉన్నప్పుడు అతని కొమ్ముని పట్టుకొన్నారు. అప్పుడు కొమ్ము విరిగి పోయి ఇక్కడ ఖననం చేయబడింది.శతాబ్ధాల తరువాత ఒకనాడు ఒక ఆవు ఇక్కడి ప్రాంతానికి వచ్చి లింగం పడిన ప్రాంతంలో పాలు కురిపిస్తుంటే పశువుల కాపరులు అక్కడి ప్రదేశాన్ని త్రవ్వగా శివ లింగం బయట పడింది.

ఇకనేపాల మహత్యంమరియు ఇతిహాస (హిమవత్ఖండం) ప్రకారం, ఒకరోజు శివుడు కాశి నుండి భాగమతి నది ఒడ్డున ఉన్న మృగస్థలి అనే ప్రదేశంలో పార్వతి సమేతంగా వచ్చి జింక అవతారంతో నిద్రుస్తుండగా దేవతలు శివుడిని కాశి తిరిగి తీసుకొని పోవడానికి జింకని లాగినప్పుడు జింక కొమ్ము విరిగి నాలుగు ముక్కలుగా పడింది. నాలుగు ఖండాలుగా పడినదే ఇప్పుడు చతుర్ముఖ లింగంగా ఉన్నదని చెబుతారు.

ఆలయ నిర్మాణ కాలం గురించి సరైన అధారాలు లేవు. “గోపాలరాజ్ వంశావలిఅనే చారిత్రాక పత్రిక ప్రకారంలించచ్చవిరాజు శుశూపదేవ క్రీ..753 సంవత్సరంలో ఆలయనిర్మాణం జరిపాడని, పదకొండవ జయదేవ పశుపతినాథ్ దేవాలయంలో వేయించిన శిలాశాసనం ద్వారా తెలుస్తొంది.. తరువాతి కాలంలో 1416 సంవత్సరంరాజా జ్యోతి మల్ల దేవాలయానికి పునరుద్ధరణ పనులు జరిపించాడని,1697 సంవత్సరంలో రాజా భూపేంద్ర దేవాలయానికి పునఃనిర్మించాడని తెలుస్తోంది.

దేవాలయం పగోడ వలె ఉంటుంది. రెండు పైకప్పులు రాగి మరియు బంగారంతో తాపడం చేయబడి ఉంటాయి.నాలుగు ప్రధాన ద్వారాలకు (తలుపులకు) వెండి తాపడం చేయబడి ఉంటుంది.పశ్చిమ ద్వారం వద్ద పెద్ద నంది బంగారు కవచంతో ఉంటుంది. నంది విగ్రహం 6 అడుగుల ఎత్తు, 6 అడుగుల చుట్టుకొలత కలిగి ఉన్నది.
ఇక్కడ పూజలు చేసే పూజారులనుభట్టఅని , ప్రధాన అర్చకుడిని మూలభట్ట లేదా రావల్ అని పిలుస్తారు. ఇక్కడి ప్రధాన అర్చకుడు నేపాల్ రాజుకు మాత్రమే జవాబుదారీ.దీనిని బట్టి ఆలయం ప్రాముఖ్యత మరియు ప్రధాన అర్చకుల అధికారాలు విఫులం అవుతాయి. మూల భట్ట (ప్రధాన అర్చకుడు) అప్పుడప్పుడు ఆలయ విశేషాలు నేపాల్ రాజుకి తెలియజేస్తుంటాడు.

నేపాలి ప్రజలకు దేవాలయం చాలా పవిత్రమైనది.ఇక్కడ ఉన్న బాగమతి నది ఒడ్డున ఆర్యాఘాట్ అనే ప్రదేశంలో స్మశాన వాటిక ఉన్నది. పశుపతినాథ్ దేవాలయానికి నేపాల్ దేశం నుండి భారత దేశం నుండి వేలాది సంఖ్యలో భక్తులు వచ్చి స్వామి దర్శనం చేసుకంటారు. ఏకాదశి, సంక్రాంతి,మహా శివరాత్రి, రాఖీ పౌర్ణమి గ్రహణం రోజు ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు మహాశివరాత్రి రోజు పశుపతి నాథ్ దేవాలయం నేతి దీపపు కుందులతో కన్నులపండుగా ఉంటుంది. వేలాది భక్తులు శివరాత్రి రోజు బాగమతి నదిలో స్నానము చేసి, శివరాత్రి పండుగ జరుపుకొంటారు


ఇంతటి ఇతిహాస,చారిత్రక ప్రాధాన్యత కలిగిన పశుపతినాథ్ దేవాలయం దర్శించటం మానవ జీవితంలో అత్యంత ప్రధానమైనది. మనలో ఎవరైనా దేవాలయం దర్శించినట్లైతే వారు నిజంగా ధన్యులే.!!శుభం భూయాత్



No comments:

Post a Comment