శ్రీ
“కపాలి (విభాసా)”శక్తి పీఠం - “బర్గోభీమ
దేవి”ఆలయం(Bargabhima Temple-Devi
Barghobhima ) గా పిలవబడుతూ, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో, పూర్వ మేదినీపూర్(Purba Medinipur-East Midnapur) జిల్లాలో “తమలుక్”(Tamluk)పట్టణంలో వున్నది. దీనిని 1150 సంవత్సరాల క్రితం మయూర్ రాజ వంశ
మహారాజులు నిర్మించిన ఈ Bhargabhima ఆలయం చెక్కినది దైవశిల్పి
విశ్వకర్మదని విశ్వసిస్తారు. ఇది కోలకతా (కలకత్తా)కు సుమారు 87.2 km,ఖరగపూర్
కు 85 km దూరంలో వుండి, NH-6 కు,south eastern railway లకు అనుసంధానం చేయబడింది.
పురాణ
కధనాల ప్రకారం ఈ ప్రదేశంలో సతీదేవి
“ఎడమ చీలమండ”(Left Ankle) పడినదని చెపుతారు. ఈ ఆలయాన్ని 51 శక్తి
పీఠంలలో ఒకటి అని భక్తులు
భావిస్తారు. ఈ ఆలయాన్ని వెస్ట్
బెంగాల్ ప్రభుత్వం “హెరిటేజ్ సైట్” గా ప్రకటించింది.
ప్రస్తుత
దేవాలయం పురాతనమైనదేమి కాదు. మధ్య యుగం
లో బెంగాల్ “ఇస్లామిక్ ఆక్రమణ” తరువాత పునర్నిర్మించారు. ఈ ఆలాన్ని గురించి
సనాతన బెంగాలీ సాహిత్యంలో అనేక మార్లు పేర్కొన్నారు.
ఈ దేవాలయము మూడు సాంస్కృతిక (హిందూ,బౌద్ధ,ఒరియా) కలయికలతో అలరారుతూ ఉంటుంది. స్థానిక బెంగాలీలు ఈ ఆలయంలో వారి నూతన సంవత్సర వేడుక, దుర్గా పూజలను అత్యంత శ్రద్ధా భక్తులతో ఘనంగా జరుపుకుంటారు.
ఈ దేవాలయము మూడు సాంస్కృతిక (హిందూ,బౌద్ధ,ఒరియా) కలయికలతో అలరారుతూ ఉంటుంది. స్థానిక బెంగాలీలు ఈ ఆలయంలో వారి నూతన సంవత్సర వేడుక, దుర్గా పూజలను అత్యంత శ్రద్ధా భక్తులతో ఘనంగా జరుపుకుంటారు.
ఆ బర్గోభీమ దేవి ఆశీస్సులు మనందరిపై
వుండాలని కోరుతూ..!!శుభం భూయాత్.
No comments:
Post a Comment