ముందుగా
– నా మాట !!
నేను, ఈ “కామాఖ్యాదేవీ” శక్తిపీఠ వర్ణనను “అతి పవిత్రంగా”, “స్వచ్చమైన మనస్సు”తో, “త్రికరణ శుధ్ధి”గా, ఆ “తల్లి” పై గల “మాతృభావం”తో,సాద్యమైనంత వరకు “అసభ్యపదజాలం” లేకుండా రాయటం జరిగింది.ఈ “పీఠవర్ణన” నా అతి తక్కువ “భావ”పటిమకు, “భాష పరిజ్ణానం”కు మించినది. నా శక్తికి మించిన దైనా కూడా,దీనిని “3 రోజుల్లో” సవివిరంగా మీ ముందుంచటానికి నేను చాలా సాహసమే చేశాను. దయచేసి “స్త్రీ మూర్తు”లైన తల్లులందరు,నన్ను తమ బిడ్డగా భావించి, నా “భావ దోషాలను” పెద్ద మనసుతో “క్షమించగల”రని భావిస్తున్నాను..!
ఇక చదవండి.. !! చూడండి.. !!
నేను, ఈ “కామాఖ్యాదేవీ” శక్తిపీఠ వర్ణనను “అతి పవిత్రంగా”, “స్వచ్చమైన మనస్సు”తో, “త్రికరణ శుధ్ధి”గా, ఆ “తల్లి” పై గల “మాతృభావం”తో,సాద్యమైనంత వరకు “అసభ్యపదజాలం” లేకుండా రాయటం జరిగింది.ఈ “పీఠవర్ణన” నా అతి తక్కువ “భావ”పటిమకు, “భాష పరిజ్ణానం”కు మించినది. నా శక్తికి మించిన దైనా కూడా,దీనిని “3 రోజుల్లో” సవివిరంగా మీ ముందుంచటానికి నేను చాలా సాహసమే చేశాను. దయచేసి “స్త్రీ మూర్తు”లైన తల్లులందరు,నన్ను తమ బిడ్డగా భావించి, నా “భావ దోషాలను” పెద్ద మనసుతో “క్షమించగల”రని భావిస్తున్నాను..!
ఇక చదవండి.. !! చూడండి.. !!
శ్రీ
“కామాఖ్యదేవి” శక్తిపీఠం భారతదేశంలో,“అసోమ్” (అస్సాం) రాష్ట్రంలో “గువాహతి” (గౌహతి) నగర పశ్చిమ భాగంలో,
“నీలాచల”(కామగిరి) కొండలలో నెలకొని వున్నది. ఇది “పది మహావిద్య”ల (కాళి,తార,కామాఖ్య,భువనేశ్వరీ,భైరవి,
చిన్నమస్త,ధూమావతి,భగలాముఖి,మాతంగి,కమల) “తాంత్రిక” దేవాలయాల సముదాయం.!! అయితే వాటిలో “త్రిపురసుందరి, మాతంగి, కమలా” దేవతలు ప్రధాన ఆలయం లోపల, మిగిలిన దేవతలు “ఏడు” దేవాలయాలలో వుంటారు.
చిన్నమస్త,ధూమావతి,భగలాముఖి,మాతంగి,కమల) “తాంత్రిక” దేవాలయాల సముదాయం.!! అయితే వాటిలో “త్రిపురసుందరి, మాతంగి, కమలా” దేవతలు ప్రధాన ఆలయం లోపల, మిగిలిన దేవతలు “ఏడు” దేవాలయాలలో వుంటారు.
ప్రాచీన
సంస్కృత గ్రంధమైన “కాళికా పురాణం”లో ఈ కామాఖ్యదేవిని
శివుని “చిన్నభార్య”గా,ముక్తిప్రదాయిని గా
మరియు “సకల మనోభీష్టదాయని”గా
వర్ణించబడింది.ఈ పురాణం ప్రకారం,”సతీదేవి”ఈ ప్రదేశాన్ని, శివుని
కోసం తన “ప్రణయతృప్తి రహస్యస్థలంగా”
ఉపయోగించినట్లు పేర్కొనబడినది మరియు శివుడు సతీదేవి
శవంతో తాండవ నృత్యం చేసినపుడు,
ఈ ప్రదేశం లోనే ఆమె “యోని”
పడినట్లు కూడా చెపుతారు.
అయితే
ఈ రెండు పరస్పర విరుధ్ధ
అభిప్రాయాలను,“దేవిభాగవతం లోని “108 శక్తి పీఠ” ప్రదేశాల
“జాబితా” ధృవ పరచటం లేదు.
దక్ష
యజ్ణానంతరం, శోకతప్తుడైన శివుని చూసి విష్ణువు, ఆయన
శోకం పోగొట్టటానికి తన“సుదర్శనచక్రం”తో
సతిదేవి “మానవ శరీరం”ని
విచ్ఛేదనం చేసినప్పుడు, సతీదేవి“రహస్యాంగమ్”(Private Part) “రెండు” ప్రదేశాలలో పడిందని, “మొదటి” భాగం -“బాహ్యజననాంగాలు” (Outer Parts)
అస్సాం రాష్ట్రంలోని “గువా”హాతి (గౌహతి)
లో“కామాఖ్యదేవి ఆలయం”వద్ద,“రెండో”భాగం -” గర్భాశయం”(Inner Parts)నేపాల్ దేశంలోని కాట్మాండ్ పట్టణంలో “భాగమతి”నది వడ్డున శ్రీ
“పశుపతినాథ్ దేవాలయ” ప్రదేశ ప్రాంతంలో పడిందని ఇతిహాస కధనం..!
ఈ కామాఖ్యాదేవి దేవాలయం వేల సంవత్సరాల చరిత్ర
కలిగినది. ప్రస్తుత దేవాలయం క్రీ.శ. 1564-63 సమయంలో
“కోచ్ వంశపు” గొప్ప యోధుడు “Chilarai” ద్వారా
1565 లో నిర్మించబడింది. అసలు “కామాపుర” ఆలయం
“రెండవ సహస్రాబ్ది” మధ్యలో ధ్వంసమైంది.
అసలు“కామాపుర”(కామాఖ్య)దేవాలయం పదహారవ శతాబ్ద ప్రారంభంలో“Moslem దండయాత్ర”లో ధ్వంసం చేయబడింది.ప్రస్తుత ఆలయం “కూచ్ బీహార్
రాజు నరనారాయణ” చేత 1565 లో పునర్నిర్మించబడింది.ఈ ఆలయంలో
ప్రార్థనా కార్యక్రమాల (స్థానిక అర్చకత్వం) కోసం,కోచ్ రాజు
“గారోస్ జాతి” పూజారులను విదేశాల
నుండి రప్పించినట్లు తెలుస్తున్నది.మొదట్లో ఈపూజారులు కామాఖ్యాదేవికి “పందుల”ను బలి
ఇచ్చే సంప్రదాయంగా వుండేది
ఐదవ శతాబ్దానికి ముందు”నరకుడు” అనే
ఒక సాహసికుడు“మిథిలా”నగరం నుండి పురాతన
అస్సాంలో తన సామ్రాజ్యాన్ని స్థాపించాడు.అతడు,తనని ఈ
”యోని-దేవత” సంరక్షకుడుగా ప్రకటించుకున్నాడు.
బహుశా ఈ పరిణామ క్రమంలోనే,తన సామ్రాజ్య “ఫ్రాక్-జ్యోతిషాపుర” పేరును “కామాపుర”గా మార్పుచేసి వుండవచ్చని
చరిత్రకారుల భావన.
“నరకుడు”జయించిన ఈ ప్రాంతవాసులు “కిరాతక”
జాతికి చెందిన ప్రజలు.వారు బహుదేహదారుఢ్యులు, అజ్ఞానులు
మరియు బొడి తలలతో,” బంగారువర్ణ”
చర్మం కలిగి వుండేవారు.వారికి
“మద్య,మాంసాలు” ఆహారపు అలవాట్లుగా వుండేవి.బహుశా ఈ “కామాపురా”దేవి వారికి గాని
లేదా వారిలోని కొన్ని“ఉప తెగ”జాతులకు
చెందిన “కులదేవత” అయి ఉండవచ్చు.
ఈ “కామఖ్యాదేవి” ఆలయం మూడు పెద్ద
మండపాలను కలిగిన ఒక సముదాయం.దీని“పశ్చిమదిశ”మండపం “దీర్ఘ చతురస్రాకారం”కలిగి
వుంటుంది. దీనిని సాధారణ భక్తులెవరూ వారి ప్రార్ధనలకు ఉపయోగించరు.
ఈ మండప గోడలపై, కూచ్
బీహార్ రాజు శ్రీ “నరనారాయణ”
చెక్కిన చిత్రాలు, సంబంధిత శాసనాలు,ఇతర దేవతా చిత్రాలను
కలిగి వుంటుంది.ఇక “మధ్య” మండపం
“చతురస్రాకారం”లో, చిన్న దేవివిగ్రహం
వున్న కూడలి.ఈ మధ్య
మండపంలో నుండే “గుహ రూపం”లో
వున్నకామాఖ్యాదేవి“గర్భగుడి”లోనికి దారివుంది.ఈ సముదాయంలోని ఇతర
ఆలయాల “గర్భగుడులు” కూడా ఇదేవిధంగా వుంటాయి.
ఇక,అత్యంత పవిత్రమైన కామాఖ్యాదేవీ ఆలయ “గర్భగుడి” నేలమట్టమునకు
దిగువుకు వుండి,సహజ నీటి(spring
waters)ప్రవాహం”గల ఒక “గుహ”లో ఉంది. ఇరుకైన
ఈ గుహలో క్రిందికి నిటారుగా
వున్నమెట్ల మార్గంతో ఒక “మర్మ(చీకటి)గది” ఉన్నది.ఈ
గదిలో గల “శిలా(రాయి)భాగం” –రెండు “పిరుదులు”ను పోలి, సుమారు
“10 అంగుళాల”లోతు చీలిక గలిగి,నిరంతరం “నీటిప్రవాహ(యోనిద్రవ)”ధారతో, “స్త్రీ జననాంగ( మంత్ర యోని)” ఆకారంలో,“పట్టు”వస్త్రం,“పుష్పాల”తో అలంకరింపబడి శ్రీ
“కామాఖ్యాదేవి”గా మనకు దర్శనమిస్తుంది.
ఈ కామాఖ్య దేవతకు జరిగే అతి ముఖ్యమైన పండుగ పేరు “అంబువాసి (అమితే) (సంతానోత్పత్తి)పండుగ”.ఇది మూడు రోజుల పండుగ. ఇది మాత కామాఖ్య భక్తులకు గొప్ప“తాంత్రిక ఉత్సవం”. “దశ మహావిద్యా,కామాఖ్య సంప్రదాయం” ప్రకారం, ఈ రోజుల్లో దేవి “రుతుస్రావం”కు లోనవుతుంది. ఈ సమయంలో (జూలై నెల) గర్భగుడిలోని “సహజనీరు(ఋతు శ్రవం)” “ఎరుపురంగు”(ఐరన్ ఆక్సైడ్)ను పోలి వుంటుంది. ఈ సమయంలో ఆలయం “మూడు రోజులు” పాటు మూసివేయబడుతుంది. తర్వాత “నాల్గవ రోజు”న ఈ గొప్ప“అంబువాసి” పండుగ ప్రారంభమవుతుంది. ఈ మూడు రోజులూ దేవి “ఋతుక్రమ బాధ”లో వున్నట్లు భావించి, ఇక్కడి ప్రజలు ఎవరూ “పొలం” పనులు వేటినీ చెయ్యరు.
ఈ కామాఖ్య దేవతకు జరిగే అతి ముఖ్యమైన పండుగ పేరు “అంబువాసి (అమితే) (సంతానోత్పత్తి)పండుగ”.ఇది మూడు రోజుల పండుగ. ఇది మాత కామాఖ్య భక్తులకు గొప్ప“తాంత్రిక ఉత్సవం”. “దశ మహావిద్యా,కామాఖ్య సంప్రదాయం” ప్రకారం, ఈ రోజుల్లో దేవి “రుతుస్రావం”కు లోనవుతుంది. ఈ సమయంలో (జూలై నెల) గర్భగుడిలోని “సహజనీరు(ఋతు శ్రవం)” “ఎరుపురంగు”(ఐరన్ ఆక్సైడ్)ను పోలి వుంటుంది. ఈ సమయంలో ఆలయం “మూడు రోజులు” పాటు మూసివేయబడుతుంది. తర్వాత “నాల్గవ రోజు”న ఈ గొప్ప“అంబువాసి” పండుగ ప్రారంభమవుతుంది. ఈ మూడు రోజులూ దేవి “ఋతుక్రమ బాధ”లో వున్నట్లు భావించి, ఇక్కడి ప్రజలు ఎవరూ “పొలం” పనులు వేటినీ చెయ్యరు.
ఈ పండుగే కాకుండా, ఆలయ పూజారులు ఈ
ఆలయంలో రోజూ సాధారణ పూజా
కార్యక్రమాలు,మరియు ఉత్సవాలు కూడా
జరుపుతుంటారు. ఈ దేవికి “జంతుబలి”
అతి సామాన్యమైన విషయం. కానీ అన్ని“ఆడ
జంతువు”లకు మాత్రం మినహాయింపు
ఇస్తారు.అలానే ప్రతి సంవత్సరం
కూడా శ్రీ దుర్గాదేవి పూజను,“
సెప్టెంబర్ –అక్టోబర్ నెలలో “నవరాత్రులను” ఘనంగా జరుపుకుంటారు.
శుభం
భూయాత్ !!
No comments:
Post a Comment