Thursday 14 August, 2014

మహా కుంభమేళా

ప్రపంచఅతిపెద్ద మతపరమైన కలయిక” ” Largest Religious Gathering in the World” దేశం లో జరుగున్నదో...? ..ఇదిగో.. ఇక్కడ ..చదివి తెలుసుకోండి..!!
ఎక్కడబ్బా...అని అనుకుంటున్నారా..? అది.. “మన భారతదేశంలోనే”. నండీ.!! ప్రతి “12 సంవత్సరాలకుజరిగేమహా కుంభమేళాలోనే..!!
కుంభ మేళాఅనేది అనేక మంది హిందువులు ఒక చోటకు చేరుకునే యాత్ర..!!. “మేళాఅంటేకూటమి,కలయిక లేక జాతరగా భావించవచ్చు. “కుంభఅనేదికుండకుసంస్కృతంలోసమానమైన అర్ధం గల పదం. దీనికేకలశంఅనే అర్ధం కూడా ఉంది. భారత ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభం అనేది ఒకరాశినికూడా సూచిస్తుంది. రాశి లోనే పండుగను నిర్వహిస్తారు.
సాధారణ కుంభ మేళాప్రతినాలుగు సంవత్సరాలకుఒకసారి జరుగుతుంది. “అర్ధకుంభ మేళా అనేది ప్రతిఆరు సంవత్సరాలకుఒకసారి హరిద్వార్ లేక ప్రయాగలలో మరియుపూర్ణ కుంభ మేళాఅనేది ప్రతిపన్నెండు సంవత్సరాలకుఒకసారి ప్రయాగ (అలహాబాద్), హరిద్వార్, ఉజ్జయిని మరియు నాసిక్ లలో జరుగుతుంది. ఇలాంటిపన్నెండు పూర్ణ కుంభ మేళాలుపూర్తి అయిన తరువాత అంటేనూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి అలహాబాద్ లోమహా కుంభ మేళానిర్వహించబడుతుంది.
జనవరి 2007లో చివరగా ప్రయాగ లో 45 రోజుల పాటు జరిగిన అర్ధ కుంభ మేళాలో 17 మిలియన్ లకు పైగా హిందువులు హాజరవగా అన్నింటిలోకి పవిత్రంగా భావించే మకర సంక్రాంతి అయిన జనవరి 15 ఒక్క రోజే 5 మిలియన్ లకు పైగా హాజరయ్యారని అంచనా.
2001లో జరిగిన చివరిమహా కుంభ మేళాకు దాదాపు 60 మిలియన్ లకు పైగా ప్రజలు హాజరయ్యారు. ఎటువంటి సందర్భంలోనైనా ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవడం ప్రపంచ చరిత్రలోనే తొలిసారి కావడం విశేషం
అనేక మంది హిందూ యాత్రికులుగంగా నదివద్దకు చేరుకొని చేసేవేడుకయే కుంభ మేళా”. సూర్యుడు మరియు బృహస్పతి (జూపిటర్) గ్రహం యొక్క స్థానాల ఆధారంగా వేడుక జరుపుకోవడం జరుగుతుంది. సూర్యుడు మరియు బృహస్పతి సింహ రాశిలో ఉన్నప్పుడు కుంభ మేళాను నాసిక్ లోని త్రయంబకేశ్వర్ లోను, సూర్యుడు మేష రాశిలో ఉన్నప్పుడు హరిద్వార్ లోను, బృహస్పతి వృషభ రాశిలో మరియు సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు కుంభ మేళాను ప్రయాగ లోను, బృహస్పతి మరియు సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయనిలోను నిర్వహించడం జరుగుతుంది. ప్రతి స్థలం లోను కుంభ మేళా నిర్వహించే తేదీలను సూర్యుడు, చంద్రుడు మరియు బృహస్పతి యొక్క స్థానాల ఆధారంగా ఎప్పటికప్పుడు నిర్ణయించడం జరుగుతుంది.
629-645 మధ్య హర్షవర్ధనుడి కాలంలో భారత దేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు హుయాన్ త్సాంగ్ లేక గ్జుయాన్జాంగ్ యొక్క రచనలలో మొదటగా కుంభ మేళాకు సంబంధించిన ప్రస్తావన కనిపిస్తుంది. అయితే నదీ సంబంధిత పండుగలు నిర్వహించడం ప్రారంభమైన ప్రాచీన భారత వేద కాలం నుండే మేళాను నిర్వహించే ఆచారం ఉన్నట్లు భావిస్తున్నారు. హిందూ పురాణాలను గమనిస్తే పురాణ గాధలలో, హిందూ సిద్ధాంతాలలో, క్షీర సాగర మధన సందర్భంలో, భాగవత పురాణంలో, విష్ణు పురాణంలో, మహా భారతంలో మరియు రామాయణం లో కుంభ మేళా కు సంబంధించిన ప్రస్తావన కనిపిస్తుంది.
పురాణాలను పరికిస్తే దేవతలు తమ శక్తీని పోగొట్టుకుని దానిని తిరిగి పొందడం కోసం అమృతాన్ని సంపాదించాలని క్షీర సాగర(పాల సముద్రం) మధనానికి పూనుకుంటారు. దీనికి గాను వీరు అమృతం లభించాక చెరి సగం తీసుకోవాలనే ఒప్పందంతో తమ శత్రువులైన అసురుల లేక రాక్షసుల సహాయం కోరతారు. అయితే అమృతాన్ని కలిగి ఉన్న కుంభం (కుండ) కనబడగానే పోట్లాట మొదలవుతుంది. పన్నెండు రాత్రులు మరియు పన్నెండు పగళ్ళు పాటు (మనుషుల దృష్టిలో పన్నెండు సంవత్సరాలు) దేవతలు రాక్షసుల మధ్య అమృతపు కుండ కోసం భీకర పోరు జరుగుతుంది. యుద్ధ సమయంలో మహా విష్ణువు అమృతపు కుంభాన్ని తీసుకుని పారిపోతూ ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయని మరియు నాసిక్ లలో కొన్ని అమృతపు బిందువులు చిలకరించాడని నమ్ముతారు
హరిద్వార్లో “1850లోజరిగిన కుంభ మేళా photo చూడవచ్చు.“ఇంపీరియల్ గెజట్ ఆఫ్ ఇండియాప్రకారంహరిద్వార్లో “1892లోజరిగిన కుంభ మేళా లో పాల్గొన్నవారికి పెద్ద ఎత్తున కలరా సోకడం వలన తరువాతి కాలంలో అక్కడి అధికారులు నిర్వహణా ఏర్పాట్లను మెరుగు పరచడం, హరిద్వార్ ఇంప్రూవ్మెంట్ సొసైటీ ఏర్పాటు కావడం జరిగింది. 1903 దాదాపు నాలుగు లక్షల మంది కుంభ మేళాకు హాజరైనట్లు తెలుస్తుంది. 1954లో అలహాబాద్ లో జరిగిన కుంభ మేళాలో తొక్కిసలాట జరిగి దాదాపు 500 మంది ప్రాణాలు కోల్పోవడమే కాక అనేక మంది గాయపడడం కూడా జరిగింది. ఏప్రిల్ 14 ,1998లో హరిద్వార్ లో జరిగిన కుంభ మేళాకు పది మిలియన్లకు పైగా ప్రజలు హాజరయ్యారు.
గంగా నది స్నానమాచారించేందుకు గాను 1998లో హరిద్వార్ కుంభ మేళాకు పది మిలియన్ లకు పైగా ప్రజలు హాజరయ్యారు. 2001లో ప్రయాగ (అలహాబాద్) లో జరిగిన మహా కుంభ మేళా కు మొత్తం దాదాపుగా అరవై మిలియన్ల మంది హాజరు కాగా దాదాపు ఒక మిలియన్ పైగా ప్రజలు ప్రపంచం అంతటా ఉన్న ఇతర దేశాల నుండి హాజరు కావడం జరిగింది. ఆయా గ్రహస్థితుల ఆధారంగా జరిగే అరుదైన మేళా 144 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే నిర్వహించడం జరుగుతుంది.
ఎక్కడైతే మేళా నిర్వహించడం జరుగుతుందో అక్కడ నదీ జలాలతో పవిత్ర స్నానం ఆచరించడం అనేది పండుగ సందర్భంగా పాటించే అతి ముఖ్యమైన ఆచారం.ఇప్పటి వరకు అత్యధికంగా నాసిక్ లో నిర్వహించిన కుంభ మేళాకు 75 మిలియన్ లకు పైగా ప్రజలు హాజరయ్యారు. మతపరమైన చర్చలు, ఆధ్యాత్మిక గానాలు, పేదలకు మరియు సన్యాసులకు అన్నదానాలతో పాటు మతం యొక్క ఆచార వ్యవహారాలను గూర్చి మత పెద్దల మధ్య జరిగే చర్చలు మేళాలో జరిగే కార్యక్రమాలు. అన్ని యాత్రా స్థలాలలోకీ కుంభ మేళాను అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. వేల సంఖ్యలోసాధువులు, సన్యాసులుహాజరవడం మేళాకు ఒక ప్రత్యేకతను సంతరించి పెట్టింది. పురాతన సాంప్రదాయాలను ప్రతిబింబించేలా సాధువులుకాషాయ వస్త్రధారులై, వొళ్ళంతా వీబూది రాసుకునికనిపిస్తారు. “నాగ సన్యాసు ని పిలవబడే కొందరు సాధువులు శీతాకాలంతో సహా అన్ని కాలాల్లోనుదిగంబరులైకనిపిస్తారు
శ్రీపరమా హంస యోగానంధరచించినఒక యోగి ఆత్మ కథఅనే పుస్తకం ప్రకారంజనవరి 1894”లో ప్రయాగలో జరిగిన కుంభ మేళా లోనే ఆయన గురువుశ్రీ యుక్తేస్వరులుమొదటి సారిగామహావతార్ బాబాజీను కలుసుకున్నారు.
కుంభ మేలా -2013 (అలహాబాద్) యొక్క అధికారిక వెబ్ సైట్ :”www.kumbhmelaallahabad.gov.in/ english/ index.html ”
70 మిలియన్ లకు పైగా ప్రజలు హాజరైన కుంభమేళా భగవంతుని పై ప్రజలకు ఉన్న విశ్వాసానికి ప్రతీక అంటూ హిందూ పత్రిక సెప్టెంబర్ 24 ప్రచురించింది. 2001లో మారిజియో బెనజో మరియు నిక్ డే లు తీసిన కుంభమేళా:ది గ్రేటెస్ట్ షో ఆన్ ఎర్త్ అనే డాక్యుమెంటరీతో పాటు నదీం ఉద్దిన్ యొక్క కుంభమేళా: సాంగ్స్ ఆఫ్ ది రివర్ (2004) మరియు ఇన్వొకేషన్, కుంభమేళా (2008) వంటి అనేక డాక్యుమెంటరీలకు కుంభమేళానే కథ అంశంగా ఉంది.
ది CBS సండే మార్నింగ్అనే ఒక ప్రముఖఅమెరికన్ మార్నింగ్ షోఏప్రిల్ 18,2010 హరిద్వార్ కుంభ మేళాను ప్రపంచంలోనే "అత్యధిక సంఖ్యలో యాత్రికులు హాజరయ్యే మత కార్యక్రమం"గా అభివర్ణించింది. భూమి పై అత్యద్భుతంగా నమ్మకాన్ని వ్యక్తీకరించే ఒక కార్యక్రమం గాను, పదుల మిలియన్ సంఖ్యలో యాత్రీకులను ఆకర్షించే అద్భుత ప్రయాణం గాను కుంభమేళాను షో అభివర్ణించింది.
ఏప్రిల్ 28,2010 BBC కుంభమేళా "గ్రేటెస్ట్ షో ఆన్ ఎర్త్" పేరుతో కుంభమేళా పై ఒక ఆడియో మరియు వీడియో రిపోర్ట్ ను వెలువరించింది.
కుంభమేళాపై ఒక పూర్తి నిడివిగల సినిమా కూడా యూట్యూబు లో లభ్యం అవుంతోంది. దాని లింక్: Kumbh Mela – 2013 full length( 1:42:08 sec) video link:”http://youtu.be/LJikI8YXZVQ”.
ఇదే కాకుండా, ఏప్రిల్ 4, 2013 హర్వర్డ్ యూనివేర్సిటీవారి“Hardvard Gazette” లో “Lessons of a temporary city” శీర్షిక పై ఒక వ్యాసాన్ని కూడా ప్రచురించి వారి విద్యార్థులకు కుంభమేళాని ఒకపాట్యాంశంగా కూడా భోదించింది.
“Researchers from across Harvard share findings from India’s Kumbh Mela festival” - nearly 50 Harvard professors, students, doctors, and researchers made a pilgrimage of their own to the festival, which housed roughly 3 million people for its 55-day duration and drew as many as 20 million visitors on peak river-bathing days. Now, those researchers are beginning to analyze the data they collected there, from thousands of patient records at clinics and hospitals to water samples from the Ganges to measurements of the pop-up city’s grid and elevation. - On Monday night, a group of professors and students shared the early results and goals of their efforts in a packed lecture hall at the Harvard Graduate School of Design (GSD)”.
ఇక రాబోయే కాలాలలో కుంభ మేళాలు క్రింది ప్రాంతాలలో జరుగుతాయి:
• 015 (ఆగష్టు 15 నుండి సెప్టెంబర్ 13 వరకు) లో జరగనున్న అర్ధ కుంభమేళాకు నాసిక్ ఆతిధ్యం ఇవ్వనుంది.
• 2016 (ఏప్రిల్ 22 నుండి మే 21 వరకు- దీనినే ఉజ్జయని లో సింహస్త్ అంటారు)లో పూర్ణ కుంభమేళా ఉజ్జయిని లో జరుగుతుంది.
• 2022 లో మహాకుంభమేళా గంగా నది ఒడ్డున హరిద్వార్ (ఉత్తరాఖండ్) లో జరుగుతుంది.
ఇవండీ ..!! మనమహా కుంభమేళావిశేషాలు. !!. వివరంగా.. తెలుసుకున్నారు.. కదా.

No comments:

Post a Comment