“త్రిపురసుందరి
శక్తిపీఠం” త్రిపుర రాష్ట్రంలో, ఉదయపూర్ – అగర్తల (55 కి.మీ) మార్గంలో,అగర్తలా పట్టణం నుండి దక్షిణ దిశగా
3 కి.మీ.దూరంలో ఒక
చిన్న గుట్టపై, వంగదేశ గోపుర నిర్మాణ శైలిలో
(శంఖమును పోలి చతురశ్రాకార గర్భ
గుడిలో) ఉంటుంది.
దీనిని
క్రీ.శ. 1501 లో మహారాజా ధన్య
మాణిక్య దేవ్ నిర్మించాడు. క్రీ.శ. 1681 లో మెరుపుల (lightning) వల్ల దెబ్బతిన్న
ఈ ఆలయాన్ని మహారాజా రామ మాణిక్య, అటు
తరువాత ఈ శతాబ్ద ప్రారంభ
కాలంలో మహారాజా రాధ కిషోర్ మాణిక్యలు
మరమ్మతులు చేయించారు.
ఈ త్రిపుర సుందరి దేవినే “Matabari” (మా కాళి/ Soroshi) అని
కూడా ఇక్కడి ప్రజలు పిలుస్తారు. ఈ ఆలయం లోపల
రెండు దేవీ విగ్రహాలు ఉన్నాయి.
ఒకటి శ్రీ “త్రిపుర సుందరి”
విగ్రహం 5 అడుగుల ఎత్తు ఉంటుంది. మరొకటి
“ఛోటీ మా” (Chhotima) విగ్రహం 2 అడుగుల ఎత్తులో ఉండి ఒక విధమైన
ఎరుపు-నలుపురంగు‘kasti’రాయితో తయారుచేయ బడి వుంటుంది. మహారాజు
ఈ ఛోటీ మా విగ్రహాన్ని
యుద్ధ సమయాల్లో తన వెంట తీసుకు
వెళ్ళేవాడని చెబుతారు.
ఇక్కడ
విశేషమేమంటే, ఈ ఆలయ ప్రాంగణం
“కూర్మ”( తాబేలు) రూపం పోలి వుంటుంది.
కనుక ఈ ఆలయాన్ని“కూర్మ
పీఠం” అని కూడా పిలుస్తారు.
ఈ ప్రదేశంలో సతీ దేవి “కుడి
పాదం” పడినదని పురాణ కధనం.
ఇతిహాసం
ప్రకారం 15 వ శతాబ్దం చివరి
సంవత్సరాలలో త్రిపురను పాలించిన Dhanya manikya రాజు, ఉదయపూర్ పట్టణం
సమీపంలోని కొండ మీద వున్నఆలయంలో
త్రిపురసుందరి దేవత ను ప్రతిష్టించమని
అతనికి ఒక రోజు మహారాజుకు
వచ్చిన కలలో దైవాజ్న(దైవవాణి)
అవుతుంది. కాని ఆ ఆలయమలో
అప్పటికే విష్ణుమూర్తిని ప్రతిష్టించి నందున, ఆయన సరసన శివుని
భార్య విగ్రహాన్ని ఎలా ప్రతిష్టించాలో నిర్ణయం
చేయలేక అయోమయానికి గురిఅవుతాడు. అయితే మరునాడు కూడా
కలలో దైవాజ్న అవగా మహారాజు ఆ
ఆదేశాన్ని శిరసావహించి దేవి విగ్రహాన్ని అందులోనే
ప్రతిష్టింప చేసాడు. ఈ పురాణ కధనం
వైష్ణవ, శైవ భక్తుల మధ్య
సయోధ్యను గుర్తుకుతెస్తూ ఉదాహరణగా చరిత్రలో శాశ్వతంగా నిలిచింది.
ఈ ఆలయ ప్రాగణంలో తూర్పు
వైపు ప్రసిద్ధ కళ్యాణ్ సాగర్ అనే పెద్ద
కోనేరు ఉంది ఉంది .దీనిలో
వున్న చేపలు,భారీ తాబేలులకు
భక్తులు బియ్యం (మురి)అటుకులు,బిస్కెట్లు
వాటికి ఆహారంగా వేస్తారు. ఈ సరస్సులో చేపలు
పట్టడం నిషేదించబడింది.
దీపావళి
ఇక్కడ ముఖ్యమైన పండుగ. ప్రతి సంవత్సరము దీపావళి
రోజున “మేళా” జరుగుతుంది. ఈ
మేళాను రెండు లక్షల కంటే
ఎక్కువ దేవి భక్తులు సందర్శిస్తారు
ఇది ఆలయ సమీపంలో జరుగుతుంది.
శ్రీ
త్రిపురసుందరి దేవికి మరొక ఆలయం ,చెన్నై
సమీపంలో Tambaram-
selaiyur camp రోడ్డులో
(చెన్నై విమానాశ్రయం నుండి సుమారు 15 కిమీ)
“Madambakkam” వద్ద ఉంది
శ్రీ
త్రిపురసుందరి దేవి రూపం, దేవాలయ
సుందర చిత్రాలను చూసి తరించండి...!! శుభం
భూయాత్.
No comments:
Post a Comment